ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్ ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపిక చేసారు. పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఎప్పటినుంచో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తినే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమించే ఆనవాయితీ కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో చర్చించి పయ్యావుల కేశవ్ ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు.
పీఏసీ చైర్మన్ పదవికి పార్టీలో ఇతర నాయకుల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, చంద్రబాబు మాత్రం పయ్యావుల కేశవ్ వైపే మొగ్గు చూపారు. పీఏసీ చైర్మన్ కు మంత్రి హోదాతో పాటు, ఎక్కడికెళ్లినా ప్రోటోకాల్ వర్తిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధిక శాఖ మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పీఏసీ చైర్మన్ గా వ్యవహరించారు.
[subscribe]
[youtube_video videoid=OOcFkdaNAU8]