దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన గిరిజన నాయకురాలు, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జులై 12వ తేదీన ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కు రానున్నారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) ఇప్పటికే తమ మద్ధతును ప్రకటించింది. ఈ క్రమంలో జూలై 18న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటు వేయాల్సిందిగా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను కోరేందుకు ద్రౌపది ముర్ము మంగళవారం ఏపీకి రానున్నారు
ముందుగా మంగళవారం మధ్యాహ్నం మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరనున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు సీఎం వైఎస్ జగన్ నివాసానికి చేరుకొని, అక్కడ సీఎం వైఎస్ జగన్ ఇచ్చే తేనీటి విందు కార్యక్రమంలో ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. మరోవైపు తదుపరి దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. ఎన్డీఏ పక్షాల ఓట్లతో పాటుగా ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్, ఏపీలోని వైఎస్సార్సీపీతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు ఆమెకు మద్దతు తెలుపడంతో ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY