మందు బాబులు దుమ్ము దులిపేశారు. డిసెంబర్ 31న చెలరేగిపోయారు. పీకల్లోతు వరకు మందుబాబులు మద్యం సేవించి పాత రికార్డులు బద్ధలు కొట్టారు. ముఖ్యంగా డిసెంబర్ 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. లిక్కర్ షాప్ గల్లపెట్టెలన్నీ నిండిపోయాయి. మద్యం దుకాణాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఒక్క తెలంగాణలోనే డిసెంబర్ 31న రూ. 172 కోట్ల మద్యం సేల్ అవ్వగా.. ఆంధ్రప్రదేశ్లో రూ. 124 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.
తెలంగాణలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ. 42.26 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో రూ. 24.78 కోట్ల లిక్కర్.. హైదరాబాద్లో రూ. 23.13 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఒక్కరోజునే తెలంగాణలో 1.76 లక్షల కేసుల లిక్కర్.. 1.66 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 31న రూ. 124.10 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 1,36,124 కేసుల లిక్కర్.. 53,482 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. వైన్స్ సమయం గంటపాటు పొడిగించడంతో పాటు.. బార్ షాపులను అర్థరాత్రి వరకు తెరిచి ఉంచడంతో మద్యం అమ్మకాలు పెరిగాయి.
ఇక డిసెంబర్ నెలలో కూడా తెలంగాణలో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ. 3,459 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లుఅబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్లో 40 లక్షల కేసుల లిక్కర్.. 34 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయని వివరించారు.
ఇకపోతే డిసెంబర్ 31న మాంసం అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. ముఖ్యంగా హైదరాబాద్లో రికార్డ్ స్థాయిలో మాంసం విక్రయాలు జరిగాయి. హైదరాబాద్లో సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. అయితే ఆదివారం.. పైగా డిసెంబర్ 31 కలిసి రావడంతో.. ఒక్కరోజే 10.5 లక్షల కేజీల చికెన్ అమ్ముడుపోయిందట. అలాగే 5.5 లక్షల కేజీల మటన్ విక్రయాలు జరిగాయట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE