OTS విషయంలో ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. దీనిపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. OTS విషయంలో ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎవరూ బలవంతం చేయటం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా అలా బలవంతం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు సత్యదూరమని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టతతో ఉందని పేద ప్రజలపై ఎలాంటి భారం మోపటం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా ఎవరినీ బలవంతం చేయటం లేదని, అది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరించిందని చెప్పారు. ప్రభుత్వం సకాలంలో స్పందించిందని, వందలాదిమంది ప్రజలను శిబిరాలకు తరలించిందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు ప్రభుత్వం నిర్లక్ష్యంగా లేదని, చాలా ముందుచూపుతో వ్యవహరించిందని చెప్పారు. అందువలననే మరణాల సంఖ్య తక్కువగా ఉందని, లేనట్లయితే ఇంకా ఎక్కువ ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ప్రజల ప్రాణాల విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ