పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అంతులేని ఫాలోయింగ్వున్న ఈ నేత కోసం ప్రాణాలయినా ఇచ్చేవారు కోట్లల్లో ఉన్నారు. ఒక్కసారయినా పవన్ను చూడాలని.. ఆయనతో మాట్లాడాలని పరితపించే వారు ఎంతో మంది ఉన్నారు. పవన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇది మాత్రం పవన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఏపీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారట. హార్ట్కోర్ ఫ్యాన్స్కు బిగ్ షాకింగ్గా ఆ నిర్ణయం ఉండబోతోందట.
2019 ఎన్నికల్లో జనసేన-తెలుగు దేశం పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాయి. తీవ్రంగా నష్టపోయాయి. ఈసారి ఆ తప్పు చేయకుండా వైసీపీ సర్కార్ను ఢీ కొట్టేందుకు జనసేన-తెలుగు దేశం పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్లడం ద్వారా కీలకమైన జిల్లాల్లో ఆధిపత్యం ఏకపక్షంగా చలాయించవచ్చని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లెక్కలేసుకుంటున్నారు. అందుకే ఈసారి ఎన్నికలను సీరియస్గా తీసుకొని పొత్తుపెట్టుకొని రంగంలోకి దిగుతున్నారు.
అటు సర్వేలు కూడా జనసేన-టీడీపీ కూటమికి అనుకూలంగా వస్తున్నాయి. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఏపీలో ఎగిరేది జనసేన-టీడీపీ జెండాలేనని సర్వేలే తేల్చేశాయి. ఇక జనసేన-టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే.. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అలాగే కీలక మంత్రిత్వ శాఖలు పవన్కు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. పొత్తులో దక్కే సీట్లు.. జనసేన గెలిచే సీట్లను బట్టి జనసేనానికి కీలక పదవులు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఈక్రమంలో ఎలాగైనా గెలుస్తామని ధీమాతోవున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. ఎన్నికల తర్వాత పూర్తిగా ఏపీకి మకాం మార్చేయాలని అనుకుంటున్నారట. అలాగే సినిమాలకు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నారట. అందుకే ఇప్పుడు కొత్త సినిమాలకు కమిట్ కావడం లేదు. ప్రస్తుతం ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి పూర్తిగా రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నారట పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట్టో వైరలవుతుండడంతో.. హార్ట్కోర్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE