టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్న శ్రీకృష్ణదేవరాయలు?.. పోటీ అక్కడి నుంచే..

Srikrishna Deva Raya, TDP, Srikrishna Deva Raya Preparing to Cover the Scarf of TDP, Lavu Srikrishnadevarayalu, TDP, Chandrababu naidu, AP Politics, AP News, AP Latest News Updates, Andhra Pradesh Latest Updates, Telugu Desham Party, Chilakaluripet, Andhra Pradesh News, Mango News Telugu, Mango News
Lavu Srikrishnadevarayalu, TDP, Chandrababu naidu, AP Politics

ఏపీలో ఎన్నికలవేళ అధికార వైసీపీకి గట్టి షాకులు తగులుతున్నాయి. పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను జగన్మోహన్ రెడ్డి మార్చేస్తుంటే.. అదే స్థాయిలో ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. టికెట్ దక్కని నేతలు.. ఆశించిన టికెట్ రాని వారంతా గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు తెలుగు దేశం, జనసేన పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఇటీవల నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసేశారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించడంతో ఆయన పదవికి, పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

ఈక్రమంలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన చేరబోయే పార్టీకి సంబంధించి రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీలో చేరుతారనే మాట బలంగా వినిపిస్తోంది. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ హైకమాండ్‌తో శ్రీకృష్ణదేవరాయలు టచ్‌లో వెళ్లారని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కూడా ఆయన పలుమార్లు చర్చలు జరిపారని తెలుస్తోంది. టీడీపీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారని.. అవి తేలగానే ఆయన తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో శ్రీకృష్ణదేవరాయలుకు తెలుగు దేశం పార్టీ చిలకలూరి పేట టికెట్ ఇవ్వాలని చూస్తోందని తెలుస్తోంది. టీడీపీ తరుపున చిలకలూరి పేట నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మాజీ మంత్రి ప్రత్తిపాట పల్లారావు చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన్ను వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి లోక్‌సభ బరిలోకి దించాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోందట. అదే సమయంలో చిలకలూరి పేట నుంచి శ్రీకృష్ణ దేవరాయులను పోటీ చేయించాలని అనుకుంటోందట.

అయితే శ్రీకృష్ణదేవరాయలుకు చిలకలూరిపేట నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఆయన నరసరావుపేట నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని అనుకుంటున్నారట. నరసరావుపేటలో ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలుకు మంచి పేరు. ప్రజాబలం కూడా ఉంది. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి నరసరావుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈక్రమంలో మరోసారి పోటీ చేస్తే కచ్చితంగా గెలిచి తీరుతానని శ్రీకృష్ణదేవరాయలు భావిస్తున్నారట. దీనిపై టీడీపీ హైకమాండ్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − seven =