ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు), అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజనీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన కామన్ వెల్త్ గేమ్స్-2022లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు స్వర్ణ పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కామన్ వెల్త్ గేమ్స్లో సాధించిన ఘనవిజయాలపట్ల పీవీ సింధు, రజనీకి సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తాను గెలిచిన స్వర్ణ పతకాన్ని పీవీ సింధు సీఎంకు చూపించారు. సీఎంను కలిసిన వారిలో పీవీ సింధు కుటుంబ సభ్యులు, రజనీ కుటుంబ సభ్యులు, ఏపీ పర్యాటక, యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అధికారులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY