కర్ణాటక, తెలంగాణలో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. అదే జోష్తో ఆంధ్రప్రదేశ్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించింది. ఓ వైపు ఎన్నికలు దగ్గరపడుతుండడం.. షర్మిలకు పార్టీ పగ్గాలు ఇవ్వడంతో.. కాంగ్రెస్ను వీడిన నేతలంతా తిగిరి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ప్రధాన పార్టీల్లో టికెట్ దక్కని వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మరికొందరు నేతలు కచ్చితంగా కాంగ్రెస్ టికెట్ దక్కుతుందనే నమ్మకంతో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారట.
ఇదిలా ఉండగా.. మాజీ ఎంపీ, సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ తరుపున విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. గతంలో సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ తరుపున విశాఖ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా విశాఖ నుంచి బరిలోకి దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నారట. ఇప్పటికే పోటీకి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారట. విశాఖలో విస్తృతంగా పర్యటిస్తున్నారట. అంతేకాకుండా సుబ్బరామిరెడ్డికి విశాఖలో పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు. వారంతా సుబ్బిరామిరెడ్డి విశాఖ నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారట.
1996, 1998 సంవత్సరాలలో సుబ్బరామిరెడ్డి 11వ, 12వ లోక్సభలకు విశాఖపట్నం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. రెండుసార్లు లోక్ సభ ఎంపీగా.. మూడుసార్లు లోక్ సభ ఎంపీగా ఆయన పనిచేశారు. అంతేకాకుండా కేంద్ర సహాయ మంత్రిగా కూడా సుబ్బిరామిరెడ్డి పనిచేశారు. 2020లో సుబ్బరామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. ఈక్రమంలో విశాఖ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సుబ్బిరామిరెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ