తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్కు 25 శాతం వెయిటేజీని రద్దు చేసింది. ఈ మేరకు 2011లో జారీ చేసిన జీఓ ఎంఎస్ 73ని సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం జీఓ ఎంఎస్ నెం.18ని జారీ చేసింది. దీని ప్రకారం.. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్)లో విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే ర్యాంకులు ఇవ్వనున్నారు. గత రెండేళ్లలో, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఈ నిబంధనను పూర్తిగా తొలగించింది. ఇక ఈ ఏడాది ఎంసెట్ మెడిసిన్ పరీక్ష మే 10 మరియు 11 తేదీలలో జరుగుతుంది. ఇంజనీరింగ్ పరీక్ష మే 12, 13 మరియు 14 తేదీలలో జరుగుతుంది. ఈ రెండు పరీక్షలు రెండు సెషన్లలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 మరియు మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు నిర్వహించబడతాయి.
కాగా రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీని అమలు చేస్తూ 2011లో అప్పటి ప్రభుత్వం జీవో 73 జారీ చేసింది. దీని ప్రకారం.. ఎంసెట్ మార్కులను 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని అమలు చేస్తున్నారు. అయితే, ఈ విధానంతో విద్యార్థులకు నష్టం కలుగుతుందన్న వాదనలు వినిపించడంతో.. ఇంటర్ వెయిటేజీ రద్దుపై అధ్యయనానికై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ క్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ, ఇంటర్ బోర్డుల నుంచి అభిప్రాయాలు తీసుకోగా.. ఈ శాఖలలోని నిపుణులు అందరూ ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దుకే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE