ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సినిమా టిక్కెట్లను పూర్తిగా ఆన్లైన్లోనే పొందే అవకాశాన్ని ప్రేక్షకులకు దక్కనుంది. దీనికోసం ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలకంటే తక్కువ ధరకు ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. టెండర్లలో జస్ట్ టిక్కెట్ సంస్థ ప్రధమ స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలోని అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. అంతేకాదు ప్రేక్షకులపై ఆన్లైన్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వమే సొంతంగా నిర్వహించాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త విధానం వలన ప్రేక్షకులకి తక్కువ ధరకే టికెట్లు లభించనున్నాయి. అలాగే గంటలు తరబడి క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా బ్లాక్ టికెట్ల బెడద లేకుండా ఆన్లైన్లోనే టికెట్లను బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ