ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సభలో వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు కొనసాగాయి. నివర్ తుఫాన్ బాధిత రైతులకు వెంటనే న్యాయం చేయాలని ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్, అధికార పార్టీ సభ్యులు ఈ అంశంపై వివరణ ఇచ్చారు. అయినప్పటికీ సభలో వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుపడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా, ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణ బాబు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, బుచ్చయ్య చౌదరి, బాల వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, బీ అశోక్, జోగేశ్వరరావు లను ఒకరోజు పాటుగా సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ