కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రైతుల నిరసనలు..స్పందించిన మంత్రి కేటీఆర్

Minister KTR Responds Over Farmers Protests on Kamareddy Master Plan,Minister KTR Responds,Over Farmers Protests,Kamareddy Master Plan,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates,Ap Bjp Party,Varahi Ready for Election Battle,Campaign Vehicle Varahi,Varahi Campaign Vehicle,Campaign Vehicle Varahi News and Live Updates,Nara Lokesh Padayatra,Lokesh Padayatra

కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్‌కి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై స్థానిక రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఘటనలపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు స్పందించారు. ఈ మేరకు ఆయన ఈరోజు హైద‌రాబాద్‌లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రంలో నిర్వ‌హించిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి స‌ద‌స్సుకు హాజ‌ర‌యిన క్రమంలో ఆ జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దాదాపు 500 ఎక‌రాలు ఇండ‌స్ట్రియ‌ల్ జోన్‌కు పోతోంద‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారని, భూ సేకరణలో తన భూమి పోతోంద‌ని రాములు అనే ఒక రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు కూడా పత్రిక‌ల్లో చూశాన‌ని, ఇది బాధాకరమని తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ఇది మాస్ట‌ర్ ప్లాన్ ముసాయిదా మాత్ర‌మేనని, ఫైనల్ డ్రాఫ్ట్ కాదని స్పష్టం చేశారు. నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్న మంత్రి, ప్రజలకు సాయం చేసేందుకే వున్నామని, ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. స్థానిక ప్ర‌జ‌ల అభిమతానికి అనుగుణంగానే ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఉంటుంద‌ని, వారికేవైనా అభ్యంత‌రాలు ఉంటే ముసాయిదాలో మళ్ళీ మార్పులు చేస్తామ‌ని కూడా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

కాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పరిధిలోకి ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం ఎనిమిది గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల్లోని రైతుల నుండి భూములను సేకరించి ఇండస్ట్రీయల్ కారిడార్‌కు కేటాయించనుండటంతో దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిలు కూడా రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =