ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ (టిడిపి) చుట్టూ తిరుగుతున్నాయి. త్వరలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వం లోని ఎన్డిఎలో చేరుతుందనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్ల క్రితం పలు కారణాలతో ఎన్డిఎ నుంచి బయటకు వెళ్లిన టీడీపీ తిరిగి బీజేపీకి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని, ఈ క్రమంలోనే దసరా నాటికి టీడీపీ మళ్ళీ ఎన్డిఎ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పలు ప్రాంతీయ టీవీ ఛానెళ్లతోపాటు ప్రముఖ జాతీయ మీడియాలో కూడా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో టీడీపీ ఎన్డీఏలో చేరనుందన్న ప్రచారంపై స్పందించారు.
గురువారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ప్రచారం చేస్తున్న వారే దానికి సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. అయినా ఈ విషయంపై తాను ఇప్పుడేం స్పందించనని, తగిన సమయం వచ్చినప్పుడు అన్నీ అందరికీ తెలిసే జరుగుతాయని వ్యాఖ్యానించారు. నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని గుర్తుచేసిన చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయం ఉంటుందని అన్నారు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే తపనతో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఎంతో నష్టపోయామని అన్నారు. ఇటీవల ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా చంద్రబాబు ఢిల్లీలో పర్యటించినప్పుడు ప్రధాని మోదీతో కరచాలనం చేసి ఐదు నిమిషాలు ముచ్చటించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ