తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ-2022 పరీక్షలను ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (సెప్టెంబర్ 2, శుక్రవారం) ఉదయం 11.30 గంటలకు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఎస్ఎస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్జామినేషన్స్ తెలంగాణ) ప్రకటించింది. ఫలితాలను సైఫాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్సైట్ లో ఫలితాలను చూసుకోవాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY