టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి జనవరి 21, మంగళవారం నాడు రాజీనామా చేశారు. రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తనపై చూపిన ఏంతో ఆదరణ చూపించారని చెప్పారు. ఇకపై భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా పోటీ చేయనని మాణిక్యవరప్రసాద్ ప్రకటించారు. ముందునుంచి మూడు రాజధానుల నిర్ణయాన్ని మాణిక్యవరప్రసాద్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతన్న శాసనమండలి సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు.
[subscribe]