ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి తీరనిలోటు అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రోశయ్య గారి మృతిపై స్పందించిన ఆయన రోశయ్య గారి లాంటి విలువలు కలిగిన నేతను కోల్పోవటం బాధ కలిగించిందని చెప్పారు. రోశయ్య గారు చాలా మంచి మనిషి అని, అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉన్న నాయకుడని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా ఆయన ఎప్పుడూ ఒకేరకంగా ఉండేవారని తెలియ చేసారు. వయసుతో సంబంధం లేకుండా అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారని, మంచి సౌమ్యశీలి అని గుర్తుచేసుకున్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలలో రోశయ్య గారు ఎప్పుడూ విసుగు, విరామం లేకుండా నిరంతరం ప్రజల సమస్యలపై పోరాటాలు చేసారని, విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారని మెచ్చుకున్నారు. ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా రోశయ్య గారిని కొనియాడారు. ఆయన రాజకీయాలలో ఒక ఇన్స్టిట్యూషన్ లాంటి వారని, రాజకీయాలలోకి కొత్తగా వచ్చే వారు అయన జీవితాన్ని చూసి ఎంతో నేర్చుకోవచ్చని సూచించారు. రోశయ్య గారు భావి తరాలకు గొప్ప ఆదర్శమని… రోశయ్య గారి లాంటి సమర్ధవంతమైన నేతని మళ్ళీ మనం చూడలేమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ