తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఏలూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆయన బుధవారం ఉదయం ఏలూరు చేరుకున్నారు. ఈ క్రమంలో కలపర్రు టోల్ గేట్ వద్ద చంద్రబాబు నాయుడుకు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో టీడీపీ చేపట్టిన భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆయన దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారు.
ఇక నేటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొంటారు. ముందుగా విజయరాయి గ్రామం, ధర్మాజీ గూడెం, మఠం గూడెం, లింగపాలెంలో జరిగే సభల్లో ప్రసంగిస్తారు. అనంతరం చిట్నాలపూడిలో రోడ్షో అనంతరం బోసు బొమ్మ సెంటర్లో జరిగే మరో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రెండో రోజు ఆయన పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలవరంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. మూడో, చివరి రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిడదవోలులో రోడ్షో, బహిరంగ సభలో రైతులతో ముఖాముఖిలో చంద్రబాబు ప్రసంగిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE