తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటుగా (నవంబర్ 16,17,18 తేదీల్లో) కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా నవంబర్ 16, బుధవారం ఉదయం చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు పత్తికొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం పత్తికొండ కోరమాండల్ ఫర్టిలైజర్స్ ప్రాంతంలో జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. బుధవారం రాత్రికి ఆదోనిలో చేకూరి ఫంక్షన్ హాల్ కు చేరుకుని, అక్కడే బస చేయనున్నారు. మరోవైపు కర్నూల్ జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ పర్యటనలో జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు.
నవంబర్ 17, గురువారం:
- గురువారం ఉదయం ఆదోనిలో రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు.
- మధ్యాహ్నం ఆర్ట్స్ కాలేజీ వద్ద బహిరంగ సభలో ప్రసంగం.
- అనంతరం ఎమ్మిగనూరు మండలంలోని చెన్నాపురం, వెంకటాపురంలో పర్యటిస్తారు.
- సాయంత్రం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్, సోమప్ప సర్కిల్, శ్రీనివాస సర్కిల్, సోమేశ్వర సర్కిల్ ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొంటారు.
- ఆ తర్వాత ఎమ్మిగనూరు చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు.
నవంబర్ 18, శుక్రవారం:
- శుక్రవారం సాయంత్రం కర్నూలులోని పార్టీ జిల్లా కార్యాలయాన్నీ సందర్శించి, అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
- అనంతరం కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని, అక్కడనుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE