రైతుల సమస్యలపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు – పల్నాడు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Visits Palnadu Today Inspected the Crops Damage due to Heavy Rains, TDP Chief Chandrababu Naidu, TDP Chief Chandrababu Visits Palnadu, Chandrababu Palnadu Tour Today, Mango News, Mango News Telugu, Chandrababu Inspected Crops Damage Palnadu, Palnadu Crops Damage Due To Heavy Rains, TDP Chief Chandrababu, TDP Chief Chandrababu Naidu News And Updates, TDP Chief Chandrababu Naidu, Chandrababu Naidu Comments on Govt, AP CM YS Jagan Mohan Reddy, Chandrababu Naidu Latest News And Live Updates

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధిలోని నాదెండ్ల, తుబడు, పలనాడు రోడ్డు రావిపాడు, నకిరేకల్లు కొండమూడు, పిడుగురాళ్లు, దాచేపల్లి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పొలాల్లోకి వెళ్లి పత్తి రైతులతో మాట్లాడారు. వర్షాలకు దెబ్బతిన్న పంటను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక చంద్రబాబు వెంట జిల్లాలోని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని, ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ద రైతులపై లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ పర్యటించలేదెందుకని ఆయన ప్రశ్నించారు. భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా మిరప, పత్తిపంటలు దెబ్బతిన్నాయని, తక్షణమే ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు. ప్రజలకు ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈసారి వైసీపీని ఓడిస్తారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగానే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కు సంఘీభావం తెలిపానని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =