మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ బూర నర్సయ్య గౌడ్ కు పార్టీ సభ్యత్వాన్ని అందించారు. అలాగే నర్సయ్య గౌడ్తో పాటు పలువురు నేతలు కూడా బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ, ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నిజాయితీగా ప్రజల అభివృధ్ధి కోసం పనిచేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో పీఎం మోదీ నాయకత్వంలో తెలంగాణకు ఎన్నో అభివృద్ధి పనులు తీసుకురావడం జరిగిందన్నారు. పీఎం మోదీ స్ఫూర్తితో సబ్ కే సాథ్, సబ్ కా వికాస్ ఔర్ అబ్ సబ్ కా విశ్వాస్ అనే నినాదం కోసం పాటుపడతానని అన్నారు. కొందరి కోసం తెలంగాణ కాదని, అందరి తెలంగాణ రావాలని పేర్కొన్నారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న బూర నర్సయ్య గౌడ్ అక్టోబర్ 15న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు లేఖ పంపిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY