24 మంది కొత్త అభ్యర్థులను బరిలోకి దించిన టీడీపీ..

TDP, Chandrababu naidu, AP Elections, TDP candidates,YSRCP,rajahmundry,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics,andhra pradesh,AP Political updates,assembly elections,Mango News Telugu,Mango News
TDP, Chandrababu naidu, AP Elections, TDP candidates

ఏపీలో రాజకీయాలు స్పీడందుకున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. అటు తెలుగు దేశం-జనసేన కూటమి కూడా సీట్ల సర్దుబాటుపై క్లారిటీ ఇచ్చి.. తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి 24 అసెంబ్లీ.. 3 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. అందులో 5 అసెంబ్లీ స్థానాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేస్తోంది వైసీపీ. పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మార్చేస్తోంది. అయితే శనివారం చంద్రబాబు 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో 24 మంది కొత్త వ్యక్తులను తెరపైకి తీసుకొచ్చారు. గతంలో టీడీపీ హయాంలో వివిధ కార్పోరేషన్లకు చైర్మన్లుగా పనిచేసినవారితో పాటు.. మరికొంత మందికి చంద్రబాబు ఈసారి టికెట్ ఇచ్చారు. ఎరిక్షన్ బాబు ప్రకారశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఆయన లిడ్ క్యాప్ కార్పోరేషన్ చైర్మన్‌గా ఎరిక్షన్ బాబు పనిచేశారు.

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి సవిత పోటీ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఆమె కురబ కార్పోరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. అటు కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన వేగేశ్న నరేంద్ర వర్మ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈసారి బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ఉండగా.. ఈసారి భవానీ స్థానంలో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు. ఆదిరెడ్డి వాసు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి.

అదే విధంగా సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్న మహాసేన రాజేశ్‌కు కూడా చంద్రబాబు ఈసారి అవకాశమిచ్చారు. పి.గన్నవరం టికెట్ కట్టబెట్టారు. ఆయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. తుని నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తొలిసారి పోటీ చేస్తున్నారు. తోయక జగదీశ్వరి కూడా తొలిసారి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన కురుపాం నుంచి బరిలోకి దిగుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + one =