విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం నాడు పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ముందుగా పొలిట్ బ్యూరో సభ్యులతో కులమతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలు లేకుండా వివక్షకు తావు లేకుండా కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేస్తామని, ప్రజా సేవలో భాగంగా నిరంతరం పని చేస్తామని చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, యనమల రామకృష్ణుడు, ఎంపీ గల్లా జయదేవ్, ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ