అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, చైనీస్ బిలియనీర్ జాక్ మా గత రెండు నెలల నుంచి బయట ప్రపంచానికి కనిపించడం లేదు. గత అక్టోబరులో చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను బయటపెడుతూ జాక్ మా వివాదాస్పద ప్రసంగం చేశారు. అనంతరం జాక్ మా వ్యాఖ్యలపై చైనా ప్రభుత్వం మండిపడుతూ, ఆయన వ్యాపార కార్యకలాపాలపై నిఘా పెట్టింది. జాక్ మాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ ఐపీవోను కూడా అడ్డుకున్నారు. ప్రభుత్వ చర్యల నేపథ్యంలో రెండు నెలలకు పైగా జాక్ మా అదృశ్యం కావడంపై అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇక నవంబరులో ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్ టాలెంట్ షో ఫైనల్ ఎపిసోడ్ కు జాక్ మా జడ్జిగా హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేదు. అనంతరం ఆ షో వెబ్సైట్ నుంచి కూడా ఆయన ఫొటోలను తొలగించారు. మరోవైపు ఇటీవల కాలంలో ఆయన సంస్థలు రూ.83 వేల కోట్లు నష్టపోయినట్టు తెలుస్తుంది. దీంతో జాక్ మా అదృశ్యంపై మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ