ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నేడు(ఫిబ్రవరి 10, గురువారం) తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. ఏపీ రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం సీఎంను కలవడానికి సినీ ప్రముఖులు వస్తున్నారని, చాలా మంది ప్రముఖులు రావాలని అనుకున్నప్పటికీ కోవిడ్ పరిస్థితుల కారణంగా తక్కువ మందిని రావాలని చెప్పామన్నారు. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు ఫైనల్ కాలేదని, ఆ అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ తుది నివేదిక ఇంకా రావాల్సి ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు.
కాగా గురువారం ఉదయం సీఎంతో జరిగే సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబెల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత డీవీవీ దానయ్య, పలు సినీ అసోసియేషన్స్ ప్రతినిధులు సహా పలువురు ప్రముఖులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో టికెట్ ధరల అంశం, కరోనా అనంతరం పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యలు, థియేటర్స్ కు రాయితీలు, నంది అవార్డులు ప్రదానంతో పాటుగా ఇతర సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ