సింగనమల టీడీపీ టికెట్‌కు గట్టి పోటీ..

Singanamala, TDP, TDP Ticket, Chandrababu naidu, YCP, Singanamala Constituency, Andhra Pradesh, Anantapur, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Singanamala, TDP, TDP Ticket, Chandrababu naidu

తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వైసీపీ ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తూ.. వారి అభ్యర్థుల కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివిన అభ్యర్థులను బరిలోకి దించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో కొన్ని చోట్ల టీడీపీకి తలనొప్పులు తప్పడం లేదు. ఎందుకంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కరికంటే ఎక్కువ మంది నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. వారందరు కూడా టికెట‌్‌కు సరితూగే నేతలే కావడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై టీడీపీ హైకమాండ్ పునరాలోచన చేస్తోంది.

ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం టికెట్ కోసం పెద్ద ఎత్తున నేతలు పోటీపడుతున్నారు. సింగనమల ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. దీంతో ఆ సమాజిక వర్గానికి చెందిన పెద్ద ఎత్తున నేతలు పోటీకి సై అంటున్నారు. తమకంటే తమకే టికెట్ కేటాయించాలని పట్టుపడుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు మహిళా నేతలు టికెట్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. టీడీపీ సీనియర్ నేత కంబగిరి రాములు కుటుంబం సింగనమల టికెట్‌ను ఆశిస్తోంది. తన కోడలు కంబగిరి స్నిగ్ధకు ఆ టికెట్ ఇప్పించుకునేందుకు రాములు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

కొంతకాలంగా స్నిగ్ధ కూడా రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఇటీవల నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కూడా స్నిగ్ధ పాల్గొన్నారు. పాదయాత్ర కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అటు నియోజకవర్గంలో కూడా స్నిగ్ధకు బలం బాగానే ఉంది. ఇదే సమయంలో బండారు శ్రావణి కూడా సింగనమల టికెట్ కోసం పోటీపడుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ శ్రావణికి సింగనమల టికెట్ కేటాయించింది. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో శ్రావణి ఓడిపోయారు.

ఈక్రమంలో మరోసారి సింగనమల టికెట్ తనకే కేటాయించాలని బండారు శ్రావణి పట్టుపడుతున్నారు. అయితే ముందుగా టీడీపీ హైకమాండ్ కూడా శ్రావణివైపే మొగ్గుచూపింది. ఆమెకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఆ నియోజకవర్గంలో నిర్వహించిన సర్వే ఫలితాలన్నీ శ్రావణికి వ్యతిరేకంగా వచ్చాయట. నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని సర్వేలో తేలిందట. అంతేకాకుండా శ్రావణి ఒంటెద్దు పోకడ పోతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈక్రమంలో శ్రావణి విషయంలో హైకమాండ్ వెనక్కి తక్కిందట.

కానీ అటు శ్రావణి.. ఇటు స్నిగ్ధ ఇద్దరు కూడా టికెట్ విషయంలో పట్టుపట్టుకొని కూర్చున్నారట. తమకే సింగనమల టికెట్ కేటాయించాలని కోరుతున్నారట. మరి టీడీపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఎవరి వైపు మొగ్గుచూపుతుంది? అనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + four =