శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీ నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవానికి విచ్చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం వీరు సీఎం వైఎస్ జగన్ ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి, ఏవీ ధర్మారెడ్డి సీఎం వైఎస్ జగన్ కు శాలువా కప్పి సత్కరించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు కూడా అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE