ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 24న ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా చీమకుర్తిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అలాగే భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కూడా జిల్లా పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి తదితరులు సీఎం వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగార్గ్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఏఎస్పీ నాగేశ్వరరావు ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY