కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగస్టు 18,19 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం రేణిగుంట విమానశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి తిరుపతి నగరంలో జరిగే జన ఆశీర్వాద్ యాత్ర ర్యాలీలో మరియు అనంతరం జరిగే సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని కిషన్ రెడ్డి దర్శించుకోనున్నారు. అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రం సందర్శన, ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తిరుపతిలోని కార్గిల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొంటారు.
అలాగే గురువారం తిరుపతి నుంచి విజయవాడ చేరుకొని నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకోనున్నారు. కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర కోసం ఏపీ బీజేపీ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కూడా కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ