ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ఫిబ్రవరి 25, మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ప్రపంచ బ్యాంక్ దక్షిణ ఆసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం ప్రాంతీయ డైరెక్టర్ షెర్బర్న్ బెంజ్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ వారికీ వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి కూడా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు తెలియజేశారు.
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా వివరించారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం ప్రశంసించినట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా ప్రతినిధులు వెల్లడించినట్టు తెలుస్తుంది.
[subscribe]