మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట కలిగిస్తూ.. ఈనెల 25వ తేదీ వరకూ ఆయనను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఈనెల 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిన్నటినుంచి (బుధవారం) ఎంపీ అవినాష్ రెడ్డి, కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారు.
ఇక ఇదిలా ఉండగా.. అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్కు వ్యతిరేకంగా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీతా రెడ్డి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు సీజేఐ ధర్మాసనం ముందు సునీత పిటిషన్ను ఆమె తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. ఆమె పిటిషన్పై స్పందించిన సుప్రీం సీజేఐ.. రేపు విచారణకు స్వీకరిస్తామని తెలిపారు. దీంతో రేపు సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు ఇదే కేసుకి సంబంధించి సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసిన ఎంపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, మరో నిందితుడు ఉదయ్ కుమార్ ఇద్దరినీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరిని ఈనెల 19నుంచి 24 వరకూ సీబీఐ విచారణకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు వీరు వేర్వేరుగా వేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE