గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో రెండోరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లీనరీ కోలాహలంగా కొనసాగుతుంది. రెండో రోజు ఫ్లీనరీలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాలపు జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా ఫ్లీనరీలో పార్టీ రాజ్యాంగ సవరణల ప్రతిపాదనలు ప్రవేశపెట్టి, ఆమోదించారు.
ఆర్టికల్ 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షులు జీవితకాలం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతారని, ఈ సవరణకు ఆమోదం తెలుపుతున్నట్టు పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. జూలై 8, శుక్రవారం జరిగిన ఫ్లీనరీలో పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున 22 సెట్ల నామినేషన్స్ దాఖలు అయ్యాయని, అలాగే ఇతరుల తరఫునుంచి ఎలాంటి నామినేషన్స్ దాఖలు కానీ కారణంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏక్రగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాలపు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ప్రకటించారు.
పార్టీ జీవిత కాలపు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయిన వైఎస్ జగన్ ను ప్రధాన నేతలు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా జెడ్పి ఛైర్మన్స్, కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ ప్రజా ప్రతినిధులు సన్మానించి, అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్లీనరీలో భవిష్యత్ కార్యాచరణ, పలు ఇతర అంశాలపై ముగింపు సందేశం ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తల కష్టం వల్లే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY