గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అవ్వగా ఇంటిలో 13 మంది సభ్యులున్నారు. ఆగస్టు 15న ప్రసారమైన బిగ్ బాస్-3 ఇరవైఆరువ ఎపిసోడ్ లో ఆగస్టు 15 సందర్భంగా బిగ్ బాస్ హౌజ్ లో స్కిట్ లు చేసారు, డాన్స్ లతో అలరించారు.
ఎపిసోడ్ 26( ఆగస్టు 15) హైలైట్స్: ఆగస్టు 15 సందర్భంగా స్కిట్ లతో అలరించిన ఇంటి సభ్యులు
- ‘వినరా వినరా దేశం మనదేరా’ సాంగ్ తో ఎపిసోడ్ మొదలయింది
- ఇంటి సభ్యులు వందేమాతరం అంటూ నినాదాలు చేసారు
- బాబా భాస్కర్ శ్రీముఖితో కలిసి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన జాఫర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు
- గిన్నెలు తోమే విషయంలో వరుణ్ సందేశ్, వితికా వాదించుకున్నారు
- కిచెన్ లో పునర్నవి అతిగా స్పందిస్తుందని వితికా, రాహుల్ చర్చించుకున్నారు
- బాత్రూం క్లీనింగ్ విషయంలో బాబాభాస్కర్ పై శ్రీముఖి, హిమజ ఇంటి కెప్టెన్ అలీరేజాకి కంప్లైంట్ చేసారు
- శ్రీముఖి గేమ్ స్ట్రాటజీ బాగుందని హిమజ తనతో చెబుతుంది, పునర్నవి అసలు మాట్లాడడానికి ఇష్టపడదని, ఎదుటి వాళ్ళకు స్పేస్ ఇవ్వదని హిమజ శ్రీముఖితో ముచ్చట్లు పెట్టింది
- ఈ వారం రాహుల్ ఇంటి నుంచి వెళ్ళిపోడుఅని, అతనికి పులిహోర రాజా అనే ట్యాగ్ ఉపయోగపడుతుంది అని శ్రీముఖి రవి, హిమజ తో చెప్తుంది
- లగ్జరీ బడ్జెట్ షాపింగ్ చేయడానికి బిగ్ బాస్ కెప్టెన్ అలీని పిలిచాడు
- ప్లాస్మా టీవీ లో ఉన్న వస్తువులను ఇంటిలో ఉన్న మిగతా సభ్యులకు కేటాయిస్తూ బోర్డ్ పై రాయమని కోరతాడు
- ఆగస్టు 15 సందర్భంగా బిగ్ బాస్ హౌజ్ లో వేడుకలు నిర్వహించారు
- తొలుత అలీ, శ్రీముఖి యాంకర్లుగా చేసారు
- పురుషుల-స్త్రీ సమానత్వంపై మహేష్ విట్టా, పునర్నవి, వితికా, రవి, ఆషు రెడ్డి, రోహిణి ఆకట్టుకునేలా స్కిట్ చేసారు
- తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్లే వారిపై వరుణ్ సందేశ్, బాబాబాస్కర్, హిమజ, సావిత్రి,శ్రీముఖి, అలీరేజా ఎమోషనల్ స్కిట్ చేసి అలరించారు
- ఇంటి సభ్యులు మేమే ఇండియన్స్ సాంగ్స్ కి డాన్స్ చేసారు
- ఈ రోజు చేసిన స్కిట్ లలో పెర్ఫార్మన్స్ పై ఇంటి సభ్యులు సరదాగా మాట్లాడుకున్నారు