ముడు లోకాలు చుట్టేస్తానంటున్న చిరు

Fans Say That The Premise Of Megastar's Latest Film Is Apart Of The Ordinary,MEGA 157 Movie,MEGA 157 Telugu Movie,MEGA 157 Telugu Movie 2023,Mango News,Mango News Telugu,Megastar Chiranjeevi's Movie,Megastar Chiranjeevi's New Movie,Megastar Chiranjeevi's Latest Movie,Megastar Chiranjeevi's 157 Movie,Megastar Chiranjeevi's Movie,Mega 157,Mega 157 Movie News and Updates,UV Creations,Mallidi Vassishta,Mega 157 Movie Release Date

మెగాస్టార్ కొత్త సినిమా సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందట. దీంతో ఇది జగదేకవీరుడు అతిలోక సుందరి,అంజి సినిమాలలో ఈ మూవీ మెగాస్టార్ కెరీర్లో బెస్ట్ అవుతుందని ఇప్పటి నుంచి తెగ పండుగ చేసుకుంటున్నారు. నిజానికి చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళాశంకర్ అనుకున్న దానికంటే ఎక్కువ నష్టాలనే తెచ్చిపెట్టింది. అంతెందుకు చిరు కెరీర్‌లో ఆచార్యకు మించిన ఫ్లాప్‌గా భోళాశంకర్‌ నిలిచిందని తెగ ఫీలవుతున్నారు.

ఇలాంటప్పుడు కచ్చితంగా ప్రస్తుతం మెగాస్టార్‌కు ఒక మంచి హిట్టు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలా అని అది ఆషామాషీ హిట్టు కాకుండా..వరుస ప్లాపుల గురించి మాట్లాడిన వారి నోళ్లకు సమాధానం చెప్పేలా ఉండాలని అంటున్నారు. వారి కోరికకు తగ్గట్లే మెగాస్టార్ కూడా బింబిసార దర్శకుడిని రంగంలోకి దింపి కథ నుంచి స్క్రీన్‌ప్లే వరకూ జాగ్రత్త పడుతున్నారట. నిజానికి బింబిసార తర్వాత దాని సీక్వెల్‌ను తెరకెక్కించడానికి ముందుగా ప్లాన్‌ చేసుకున్న వశిష్ట.. తర్వాత ప్లాన్ మార్చుకుని చిరు సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీ అయిపోయాడు.

ఆ మధ్య రిలీజైన మెగాస్టార్ 157 ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు అభిమానుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని ఈ పోస్టర్‌లో చూపిస్తూ మూవీపై ఎక్కడ లేని క్యూరియాసిటీని పెంచేసారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి‌ సోషల్‌ మీడియాను ఊపేస్తుంది. నిజానికి ఈ మూవీ సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుందన్న వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అందులో ఒక పాయింట్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమా స్టోరీ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందట. అంతేకాదు ఈ సినిమాలో నలుగురు హీరోయిన్‌లు కనిపించనున్నారట. అందులో అనుష్క శెట్టి, మృణాళ్ ఠాకూర్‌ దాదాపుగా కన్ఫర్మ్‌ అయిపోగా మరో ఇద్దరి కోసం చూస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటున్న ఈ మూవీ.. ఈ ఇయర్ ఎండింగ్‌కు కానీ వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్‌ మొదలు కాబోతుంది.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిరు పాన్‌ ఇండియా మూవీకి కీరవాణి స్వరాలు అందించనున్నాడు. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత అంటే 1994లో వచ్చిన ఎస్‌.పీ.పరుశురామ్‌ తర్వాత ఈ కాంబోలో సినిమా రాబోతోంది. ఇక ఈ సినిమా కంటే ముందు మెగాస్టార్.. కళ్యాణ్ కృష్ణ కురసాలతో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తవగా… చిరు పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ రెండు సినిమాలను.. కొన్ని నెలల గ్యాప్‌లోనే రిలీజ్‌ చేసే విధంగా షూటింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారట మెగాస్టార్.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eighteen =