ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,93,171 కు చేరుకుంది. గత 24 గంటల్లో 30,578 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 4,605 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 642, పశ్చిమగోదావరిలో 539, గుంటూరు జిల్లాలో 524, నెల్లూరు జిల్లాలో 501, కృష్ణా జిల్లాలో 477, కడప జిల్లాలో 413, ప్రకాశం జిల్లాలో 342, కర్నూల్ జిల్లాలో 318, చిత్తూరు జిల్లాలో 290, విశాఖపట్నం జిల్లాలో 219, అనంతపూర్ జిల్లాలో 218, శ్రీకాకుళం జిల్లాలో 105, విజయనగరంలో 17 కేసులు నమోదయ్యాయి.
ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 10 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 14641 కి పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 11,729 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 21,85,042 కు చేరింది. అలాగే ప్రస్తుతం 93,488 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ఫిబ్రవరి 3 నాటికీ ఏపీలో మొత్తం 3,25,71,365 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ