తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. సాధారణ ప్రజలతో పాటుగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రోజుకొకరు కోవిడ్ బారినపడుతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ సర్కార్ ఆంక్షలను అమలు చేస్తున్నప్పటికీ కేసలు సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. తాజాగా, హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో 44 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. వీరిలో 20 మంది మెడికోలు, 10 మంది హౌస్ సర్జన్స్, 10 మంది పీజీ స్టూడెంట్స్ ఇంకా నలుగురు అధ్యాపకులు ఉన్నారు. ప్రస్తుతం వీరందరినీ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని గాంధీ హాస్పిటల్ అధికారులు తెలిపారు.
మరోవైపు తెలంగాణలో కోవిడ్ కేసులు పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలను తగ్గించాలని ఆదేశించింది. ఈ క్రమంలో.. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే అత్యవసరం కాని శస్త్ర చికిత్సలు నిలిపి వేశారు. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో త్వరలోనే గాంధీలో జీనోమ్ సీక్వెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. ఆస్పత్రుల సిబ్బంది, డాక్టర్లు కూడా కోవిడ్ బారినపడుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ