దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,82,970 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 19, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,79,01,241 చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదైంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 441 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,87,202కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 18 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 93.88 శాతం:
దేశంలో యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య 18 లక్షలు (18,31,000 – 4.83%) దాటింది. ఇక కొత్తగా 1,88,157 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 3,55,83,039 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 93.88 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.29 శాతంగా ఉంది. అలాగే జనవరి 18, మంగళవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 70,74,21,650 కు చేరుకుంది. జనవరి 18న 18,69,642 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF