మహారాష్ట్రలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై కరోనా పంజా విసిరినట్లు కనిపిస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా పలువురు శాసనసభ సిబ్బంది, పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 50 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శీతాకాల సమావేశాలు జరిగిన ఈ 5 రోజుల్లో దాదాపు 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు, అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. డిసెంబరు 22 నుంచి మొదలైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిశాయి.
సోమవారం వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ తాను కరోనా బారిన పడినట్లు స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. అయితే, తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నానని తెలిపారు. తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, త్వరగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. వర్ష గైక్వాడ్ గతేడాది కూడా వైరస్ బారినపడటం విశేషం. మరో మంత్రి కేసి పాద్వీ, భాజపా ఎమ్మెల్యే సమీర్ మేఘే లకు కూడా వైరస్ సోకింది. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కారు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు కూడా విధించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ