అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ సంస్థ భారతీయ దిగ్గజ అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మానిప్యులేషన్ వంటి మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది వెల్లడించిన రీసెర్చ్ రిపోర్ట్ అనంతరం గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలడం తెలిసిందే. ఈ గ్రూప్ స్టాక్స్ అమ్మకాలు నిరంతరం కొనసాగడంతో చివరకు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ తన ఎఫ్పీఓను ఉపసంహరించుకోవలసి వచ్చింది. దీంతో అదానీ గ్రూప్ కొన్ని వేలకోట్ల డాలర్ల మేర నష్టపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పతనానికి కారణమైన హిండెన్బర్గ్కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన టాప్ లీగల్ ఫర్మ్ వాచ్టెల్ అనే న్యాయవాద సంస్థను నియమించుకుంది. అంతేకాకుండా ఈ సంస్థలోని అత్యంత అనుభవజ్ఞులైన న్యాయవాదులు లిప్టన్, రోజెన్, కట్జ్లను ఎంపిక చేసుకుంది.
కాగా న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఈ న్యాయవాద సంస్థకు అమెరికాతో సహా వివిధ అంతర్జాతీయ కార్పొరేట్ చట్టాలు, సంక్లిష్ట లావాదేవీల నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అమెరికాలోని పలు పెద్ద కంపెనీలు ఏదైనా అత్యవసర న్యాయ సహాయం కావలసినప్పుడు మొదట సంప్రదించే న్యాయవాద సంస్థగా వాచ్టెల్కు గొప్ప పేరుంది. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ల దాడికి గురైన బహుళజాతి కంపెనీలు న్యాయ పోరాటం కోసం ఈ సంస్థనే ఆశ్రయిస్తూ ఉంటాయి. కాగా ఈ రంగంలో దీనికి దశాబ్దాల అనుభవం ఉంది, మరియు ఎంతో ఖరీదైనదిగా కూడా గుర్తింపు ఉంది. దీంతో ఇప్పుడు అదానీ గ్రూప్ దీనిని ఆశ్రయించడం వ్యాపార వర్గాలలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక త్వరలోనే అదానీ గ్రూప్ హిండెన్బర్గ్పై కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE