కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో చేరిన సంగతి తెలిసిందే. అమిత్ షా కు ఆగస్టు 14 వ తేదీన నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ గా వచ్చింది. కొద్దీ రోజుల అనంతరం అలసట మరియు శరీర నొప్పులు ఉండడంతో కరోనా అనంతరం చికిత్స (పోస్ట్ కోవిడ్ కేర్) కోసం ఎయిమ్స్ లో చేరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అమిత్షా పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవ్వనున్నారని ప్రకటనలో తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu