డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు వద్ద నీలగిరి కొండల్లో కుప్పకూలింది. హెలికాప్టర్ లో రావత్ తో పాటు ఇంకో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 9 మందిలో కొందరు ప్రమాద స్థలంలోనే మరణించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కనిపిస్తున్నాయి. మృతదేహాలు వెలికి తీస్తున్నారు. కోయంబత్తూర్ నుంచి వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ అధికారులు విచారణకు ఆదేశించారు.
డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రధాని అధ్యక్షతన ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. భేటీలో ఉన్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని అడిగి వివరాలు తెలుసుకున్న ప్రధాని, వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ