సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 21,09,208 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షలకు 20,93,978 మంది విద్యార్థులు హాజరుకాగా, 19,76,668 మంది అనగా 94.40 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. బాలికల ఉత్తీర్ణత శాతం 95.21 ఉండగా, బాలురు 93.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ట్రాన్స్ జెండర్స్ ఉత్తీర్ణత 90 శాతంగా నమోదయినట్టు తెలిపారు. 64,908 మంది విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించగా, 2,36,993 మంది విద్యార్థులు 90% కంటే ఎక్కువ మార్కులు సాధించినట్టు తెలిపారు.
ఇక ఫలితాలను cbseresults.nic.in, results.cbse.nic.in వంటి అధికారిక వెబ్ సైట్స్ లో అందుబాటులో ఉంచారు. అలాగే cbse.digilocker.gov.in లో కూడా విద్యార్థులు వారి స్కోర్ లను చూసుకోవచ్చని చెప్పారు. ఇక సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో త్రివేండ్రం రీజియన్ లో 99.68 శాతంతో అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం నమోదు చేయగా, గువాహటి 82.23 శాతంతో చివరన నిలిచింది. మరోవైపు శుక్రవారం ఉదయమే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. 10, 12వ తరగతుల ఫలితాలను ఇలా ఒకేరోజు విడుదల చేయడం ఇదే తొలిసారి. 12వ తరగతి ఫలితాల్లో 92.71 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY