ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బుధవారం ఉదయం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీపరంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగిందని సోమువీర్రాజు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గ్) బీఎల్ సంతోష్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఊహాగానాలు సహా పలు ఇతర అంశాల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమువీర్రాజు తాజాగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ