ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో గురువారం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఈవీఎంలు చేరుకోగా.. ఈ ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. కాగా ఈ మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ స్థానాల చొప్పున ఉన్నాయి. అయితే నాగాలాండ్, మేఘాలయల్లో ఒక్కో సీటు ఏకగ్రీవమవ్వడంతో 59 స్థానాలకే పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయమున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి రానుండటం ప్రధాన పార్టీలకు కీలకం కానుంది.
త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 35 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుందని, లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి 6-12 సీట్లు వస్తాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అలాగే మేఘాలయలో ఎన్పీపీ 21-26 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 8-13 సీట్లు, బీజేపీ 6-12 సీట్లు, కాంగ్రెస్ 3-6 సీట్లు గెలుచుకుంటాయని లెక్కలేసింది. ఇక నాగాలాండ్లో అధికార ఎన్డీపీపీ-బీజేపీ కూటమి తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ క్రమంలో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 38 నుంచి 48 సీట్లు, కాంగ్రెస్ కేవలం సింగల్ డిజిట్ (1-2 సీట్లు)కు పరిమితమవుతుందని పేర్కొన్నాయి. కాగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో మూడు రాష్ట్రాల్లో పాగా వేయగలమని బీజేపీ భావిస్తుండగా.. మరికొన్ని గంటల్లో తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE