నేటినుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (ఏపీజీఐఎస్)ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మూడు రోజుల వైజాగ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
సీఎం జగన్ మూడు రోజుల వైజాగ్ టూర్ షెడ్యూల్..
మార్చి 2వ తేదీ (గురువారం) షెడ్యూల్
- ఈరోజు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరతారు.
- సాయంత్రం 5:15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.
- ఈరాత్రికి ప్రత్యేక అతిథి గృహంలో బస చేయనున్నారు.
మార్చి 3వ తేదీ (శుక్రవారం) షెడ్యూల్
- రేపు ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వద్దకు చేరుకొని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభిస్తారు.
- రాత్రి 8-9 గంటల మధ్య ఎంజీఎం పార్క్ హోటల్ లో జీఐఎస్ డెలిగేట్స్ కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు.
- అనంతరం రేపు రాత్రికి నగరంలో బస చేస్తారు.
మార్చి 4వ తేదీ (శనివారం) షెడ్యూల్
- శనివారం ఉదయం 9:10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వద్దకు చేరుకొని రెండోరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొంటారు.
- ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలను, జీఐఎస్ ప్రతినిధులతో చర్చిస్తారు.
- సీఎం జగన్ సమక్షంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే పరిశ్రమలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోకునుంది.
- చివరిగా మధ్యాహ్నం 2 గంటలకు వైజాగ్ నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరతారు.
- మధ్యాహ్నం 3:40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE