అయోధ్యాపురిలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడంతో ఇప్పుడు భక్తుల చూపు అటే పడింది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రారంభం అవడం కంటే ముందే ..అత్యంత ఘనంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యాక కూడా అందరి నోట అయోధ్యమాటే వినిపిస్తుంది. ఈ మహా క్రతువును కళ్లారా వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి కోట్లాది మంది ప్రజలు.. సినీ, రాజకీయ ప్రముఖులు అయోధ్యకు తరలివచ్చారు. రామనామంతో ఒక్క అయోధ్యనే కాక..యావత్ దేశం మారు మ్రోగిపోయింది.
అయితే ఇకపై అయోధ్య బాల రాముడి పేరు మారినట్లు రామ జన్మభూమి ట్రస్టు పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. అయోధ్య రామ మందిరంలో కొలువైన ఈ బాల రాముడిని ఇక మీదట ‘బాలక్ రామ్’ గా పిలవనున్నట్లు ఆయన చెప్పారు . అలాగే అయోధ్య ఆలయాన్ని కూడా బాలక్ రామ్ మందిరంగానే ఇక నుంచి పిలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు
మరోవైపు బాలక్ రామ్ రూపంలో ఉన్న శ్రీరాముని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఓ వైపు నిర్మాణపనులు జరుగుతున్నా..మరోవైపు భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. జనవరి 23వ తేదీ నుంచే మళ్లీ నిర్మాణ పనులను మొదలు పెట్టినట్లు కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పుకొచ్చారు. మంచి ముహూర్తం కావడంతోనే జనవరి 22న ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని.. 2024 ముగిసేసరికి నూతన ఉత్సాహంతో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రామ ఆలయ ప్రాంగణంలోనే ఇంకా ఏడు ఉపాలయాలు నిర్మించాల్సి ఉందని.. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత వీటిని పూర్తి చేసే పనిని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ