భారత్ Vs శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ : 20 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన

BCCI Announced India’s Squad for ODI, BCCI Announced India’s Squad for ODI and T20I Series, BCCI Announced India’s Squad for ODI and T20I Series Against Sri Lanka, India squad for Sri Lanka series, India vs Sri Lanka 2021 Squad, India vs Sri Lanka 2021 Squad ANNOUNCED, India’s squad for ODI & T20I series against Sri Lanka, India’s Squad For Sri Lanka Announced, Mango News, Sri Lanka, T20I Series Against Sri Lanka

భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13-25 తేదీల మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలకంతో తలపడే 20 మంది ఆటగాళ్లతో కూడిన భారత్ జట్టును బీసీసీఐ గురువారం నాడు ప్రకటించింది. భారత జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ టూర్‌లో ఉన్న నేపథ్యంలో ఈ వన్డే, టీ20 సిరీస్ లకు యువకులతో కూడిన జట్టును అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. శిఖర్‌ ధావన్‌ కు కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించగా, బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. ఇక ఈ సిరీస్ లో అన్ని మ్యాచ్‌లు కొలంబోలోని ఆర్ ప్రేమదాసా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే జరుగనున్నాయి.

శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ లకు ఎంపికైన భారత్ జట్టు:

  1. శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌)
  2. భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌)
  3. పృథ్వీ షా
  4. దేవ్‌దత్‌ పడిక్కల్‌
  5. రుతురాజ్‌ గైక్వాడ్‌
  6. సూర్యకుమార్‌ యాదవ్‌
  7. మనీష్‌ పాండే
  8. హార్దిక్‌ పాండ్య
  9. నితిష్‌ రాణా
  10. ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌)
  11. సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌)
  12. యజువేంద్ర చాహల్‌
  13. రాహుల్‌ చాహర్‌
  14. కె.గౌతమ్‌
  15. కృనాల్‌ పాండ్య
  16. కుల్‌దీప్‌ యాదవ్‌
  17. వరుణ్ చక్రవర్తి
  18. దీపక్‌ చాహర్‌
  19. నవ్‌దీప్‌ సైనీ
  20. చేతన్‌ సకారియా

–> నెట్‌ బౌలర్స్‌: ఇషాన్‌ పోరెల్‌, సందీప్‌ వారియర్‌, హర్షదీప్ సింగ్‌, సాయి కిషోర్‌, సిమర్‌జీత్‌ సింగ్‌

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seventeen =