భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13-25 తేదీల మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలకంతో తలపడే 20 మంది ఆటగాళ్లతో కూడిన భారత్ జట్టును బీసీసీఐ గురువారం నాడు ప్రకటించింది. భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ టూర్లో ఉన్న నేపథ్యంలో ఈ వన్డే, టీ20 సిరీస్ లకు యువకులతో కూడిన జట్టును అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. శిఖర్ ధావన్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించగా, బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక ఈ సిరీస్ లో అన్ని మ్యాచ్లు కొలంబోలోని ఆర్ ప్రేమదాసా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే జరుగనున్నాయి.
శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ లకు ఎంపికైన భారత్ జట్టు:
- శిఖర్ ధావన్ (కెప్టెన్)
- భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్)
- పృథ్వీ షా
- దేవ్దత్ పడిక్కల్
- రుతురాజ్ గైక్వాడ్
- సూర్యకుమార్ యాదవ్
- మనీష్ పాండే
- హార్దిక్ పాండ్య
- నితిష్ రాణా
- ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
- సంజు శాంసన్ (వికెట్ కీపర్)
- యజువేంద్ర చాహల్
- రాహుల్ చాహర్
- కె.గౌతమ్
- కృనాల్ పాండ్య
- కుల్దీప్ యాదవ్
- వరుణ్ చక్రవర్తి
- దీపక్ చాహర్
- నవ్దీప్ సైనీ
- చేతన్ సకారియా
–> నెట్ బౌలర్స్: ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, హర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జీత్ సింగ్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ