భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఆగస్టు 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే మూడు మ్యాచుల వన్డే సిరీస్ కోసం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన భారత్ జట్టును ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్ కు భారత్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు విశ్రాంతి కల్పించారు. శ్రేయాస్ అయ్యర్ కూడా ప్రకటించిన జట్టులో లేడు.
గాయం కారణంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్ కు కూడా దూరమయ్యాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఈ వన్డే సిరీస్ కు మరోసారి భారత్ జట్టు కెప్టెన్ గా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు. కాగా కొంత విరామం అనంతరం ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ దీపక్ చాహర్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే బ్యాటర్ రాహుల్ త్రిపాఠి కూడా తొలిసారిగా వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
జింబాబ్వేతో 3 వన్డేలకు భారత్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY