టీ20 ప్రపంచ కప్-2022: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే…

BCCI Announced Team India Squad for ICC Mens T20 World Cup 2022, BCCI New Team, ICC Mens T20 World Cup 2022, ICC Mens Team, T20 World Cup 2022, ICC Mens Indian Team, Mango News, Mango News Telugu, Rohit Sharma C, KL Rahul VC, Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant WK, Dinesh Karthik WK, Hardik Pandya, R. Ashwin, Y Chahal, Axar Patel, Jasprit Bumrah, B Kumar, Harshal Patel, Arshdeep Singh, T20 World Cup Latest News And Updates

టీ20 ప్రపంచకప్-2022 అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా దేశంలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు టీ20 ప్రపంచకప్‌ లో పాల్గొనే టీమిండియా జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌ కోసం అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టును ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది. టీ20 ప్రపంచ కప్ కోసం మహమ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ లను స్టాండ్‌బై ఆటగాళ్లగా ప్రకటించారు. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌ గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అలాగే త్వరలో స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ల కోసం కూడా బీసీసీఐ భారత్ జట్లను ప్రకటించింది.

గాయాల నుంచి కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా మరియు హర్షల్ పటేల్ టీ20 ప్రపంచ కప్ కోసం జట్టులో చోటు దక్కించుకున్నారు. బౌలర్ అర్ష్దీప్ సింగ్ పై సెలెక్టర్లు మరోసారి నమ్మకముంచారు. స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకోగా, వికెట్ కీపర్ బ్యాటర్స్ రిషబ్ పంత్ మరియు దినేష్ కార్తీక్ ఇద్దరూ తుది జట్టులో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లకు మహమ్మద్ షమీ ఎంపికవగా, టీ20 ప్రపంచ కప్ కోసం స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు. గాయంకారణంగా సర్జరీ అవడంతో రవీంద్ర జడేజా టీ20 ప్రపంచకప్ కు దూరం అవగా, అవేశ్ ఖాన్, సంజు సాంసన్ కు తుదిజట్టులో చోటు దక్కలేదు

గత జనవరిలోనే టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ ను కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేయగా, ఈ ఐసీసీ టోర్నమెంట్ కోసం అన్ని క్రికెట్ బోర్డులు వరుసగా ఎంపిక చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటిస్తున్నాయి. మరోవైపు టీ20 ప్రపంచకప్ కు ముందు భారత్ స్వదేశంలో సెప్టెంబర్‌ 20, 23, 25 తేదీల్లో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, ఆ తర్వాత సెప్టెంబర్ 28, అక్టోబర్ 2, 4 తేదీల్లో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ల కోసం ప్రపంచకప్ కు ఎంపికైన ఆటగాళ్లతో కూడిన జట్లనే బీసీసీఐ ప్రకటించింది. కాగా దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ కు భువనేశ్వర్‌కుమార్‌ కు, ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌ కు అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ మరియు భువనేశ్వర్ కుమార్ ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాతో స్వదేశీ సిరీస్‌ల సమయంలో కండిషనింగ్-సంబంధిత పని కోసం నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేస్తారని తెలిపారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్ జట్టు:

  1. రోహిత్ శర్మ (కెప్టెన్)
  2. కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్)
  3. విరాట్ కోహ్లీ
  4. సూర్యకుమార్ యాదవ్
  5. దీపక్ హుడా
  6. రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
  7. దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్)
  8. హార్దిక్ పాండ్యా
  9. ఆర్.అశ్విన్
  10. యుజ్వేంద్ర చాహల్
  11. అక్షర్ పటేల్
  12. జస్ప్రీత్ బుమ్రా
  13. భువనేశ్వర్ కుమార్
  14. హర్షల్ పటేల్
  15. అర్ష్దీప్ సింగ్.

స్టాండ్‌బై ప్లేయర్స్:

  1. మహమ్మద్ షమీ
  2. శ్రేయాస్ అయ్యర్
  3. రవి బిష్ణోయ్
  4. దీపక్ చాహర్.

 

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =