పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందుగానే తమ పార్టీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఆప్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మార్చి 16, బుధవారం నాడు పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎంగా ప్రమాణస్వీకారం రాజ్భవన్లో కాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల స్వగ్రామమైన నవాన్షహర్ జిల్లాలోని ఖట్కర్ కలాన్లో జరగగా, రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ భగవంత్ మాన్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యకమానికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు నటులు హాజరయ్యారు. అలాగే పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ ఆప్ 92, కాంగ్రెస్ 18, ఎస్ఏడీ 3, బీజేపీ 2, బీఎస్పీ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆప్ కు పూర్తి మెజారిటీ దక్కడంతో మార్చి 11న ఆప్ ఎమ్మెల్యేలంతా చండీగఢ్లోని మొహాలీ క్లబ్లో సమావేశమై తమ శాసనసభాపక్ష నేతగా భగవంత్ మాన్ ను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ నేడు ప్రమాణస్వీకారం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ