ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చదువులు మధ్యలోనే వదిలేసి ఇటీవలే తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన ఏపీ విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు.
“రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో ఉక్రెయిన్లో చదువుతున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నారు. వచ్చిన విద్యార్థుల్లో కొంతమందికి ఇప్పటికే ఆన్లైన్లో తరగతులను ప్రారంభించగా, తాము చదివే వర్సిటీ నుంచి ఎటువంటి సమాచారం లేక మరికొందరు అయోమయంలో వున్నారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోర్సులు పూర్తికి చర్యలు తీసుకుంటామని, ఆర్థికంగా అయ్యే ఖర్చు భరిస్తామని ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విద్యార్థులు చదువు పూర్తయ్యే బాధ్యతని తీసుకోవాలని కోరుతున్నాను” అని నారా లోకేష్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన ఏపీ విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలంటూ సీఎం @ysjagan గారికి లేఖ రాసాను. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో ఉక్రెయిన్లో చదువుతున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చేరుకున్నారు.(1/3) pic.twitter.com/JlspOr2bsa
— Lokesh Nara (@naralokesh) March 16, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ